हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

CM Chandrababu: పులివెందుల విజయంపై స్పందించిన చంద్రబాబు

Anusha
CM Chandrababu: పులివెందుల విజయంపై స్పందించిన చంద్రబాబు

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత, పులివెందులలో తొలిసారిగా టీడీపీ (TDP) అభ్యర్థి విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి 6,050 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఘనవిజయం సాధించారు. ఈ విజయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం. పులివెందుల వంటి వైఎస్సార్‌సీపీ బలమైన కోటలో ఇది అరుదైన పరిణామం.

అక్కడి ప్రజాస్వామ్య పోరాటానికి నిదర్శనం

లతా రెడ్డి, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సతీమణి. ఆమె విజయం సాధించడంలో స్థానిక ప్రజల మద్దతు, పార్టీ శ్రేణుల కృషి, అలాగే ఇటీవల రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పులు కీలకంగా మారాయి. పులివెందుల జడ్పీటీసీ (Pulivendula ZPTC) స్థానానికి ఈసారి మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇది అక్కడి ప్రజాస్వామ్య పోరాటానికి నిదర్శనం. గతంలో ఈ స్థానం ఎక్కువసార్లు ఏకగ్రీవం అయినప్పటికీ, ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కడప శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో కౌంటింగ్ నిర్వహించగా, టీడీపీ విజయం సాధించిందన్న వార్త పులివెందులలో సంబరాలను రేపింది.

CM Chandrababu
CM Chandrababu

సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు

ఈ ఘన విజయంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పందించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఏకంగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చంద్రబాబు అన్నారు. 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామంటూ బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు స్లిప్పులు పెట్టారని, పులివెందులలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించారని చెప్పారు. ఈ విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసే విధంగా నేతలు స్పందించాలని చెప్పారు. 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాశామని అన్నారు.జగన్ అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ధైర్యంగా ఓటు వేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రులకు సూచించారు

చంద్రబాబు నాయుడు జన్మతేది ఏమిటి?

20 ఏప్రిల్ 1950.

చంద్రబాబు నాయుడు ఐటీ రంగ అభివృద్ధికి చేసిన కృషి ఏంటి?

హైదరాబాదును సైబరాబాద్‌గా మార్చి, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేశారు. హైటెక్ సిటీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tdp-tdp-wins-pulivendula-zptc-by-election/andhra-pradesh/530204/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870