AP inter class

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియట్ కాలేజీలు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. ఈ టైమింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు టైమింగ్స్‌ను పొడిగించారు. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

Advertisements

విద్యార్థులు సరిగా రాణించ‌క‌పోవ‌డంతోనే గంటసేపు టైమింగ్స్ పెంచామ‌ని.. ఆ గంట‌సేపు విద్యార్థులు కాలేజీల్లోనే చ‌దువుకుంటార‌ని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంట‌ల నుండి 5 గంట‌ల వ‌ర‌కు కాలేజీల్లో స్ట‌డీ అవ‌ర్స్ నిర్వ‌హించాల‌ని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాల‌ని అన్ని ప్ర‌భుత్వ, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియట్ కాలేజీ ప్రిన్సిప‌ల్స్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చిన‌ట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల‌ని కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు న‌మూనాను కాలేజీలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల‌కు తెల్లరంగు, జ‌న‌ర‌ల్ విద్యార్థుల‌కు ఫస్టియర్‌ విద్యార్థులకు వారికి లేత ప‌సుపు రంగు, సెకండియర్‌ విద్యార్థులకు నీలం రంగు కార్డుల‌ను ముద్రించి ఇవ్వాల‌ని సూచించారు.

Related Posts
UNESCO Recognition: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు
UNESCO recognizes Bhagavad Gita and Dance Science

UNESCO Recognition : భారతదేశం విభిన్న సంస్కృతులకు ఆలవాలం. గొప్ప తాత్విక ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎన్నో కళలకు ప్రతీతి. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచ Read more

US సాయం నిలిపివేత… భారత్ పై ప్రభావం ఎంతంటే.?
usaid bharath

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో USAID (United States Agency for International Development) ద్వారా అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. భారత్‌కు కూడా Read more

కెనడా ప్రధాని పోటీలో మరో భారతీయుడు
కెనడా ప్రధాని పోటీలో మరో భారతీయుడు

లిబరల్ పార్టీలో అంతర్గత విభేదాల మధ్య జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన నాలుగు రోజుల తరువాత, భారతీయ సంతతికి చెందిన పార్లమెంటు Read more

దళితుడ్ని కిడ్నాప్ చేసినందుకు వంశీని అరెస్ట్ చేశారు : లోకేశ్
Vamsi was arrested for kidnapping a Dalit .. Lokesh

ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు అమరావతి: తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా Read more

×