हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Vikasit Bharat : ‘వికసిత్ భారత్’లో సివిల్ సర్వెంట్లదే కీలక పాత్ర – మోదీ

Sudheer
Vikasit Bharat : ‘వికసిత్ భారత్’లో సివిల్ సర్వెంట్లదే కీలక పాత్ర – మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సివిల్ సర్వీసుల ప్రాముఖ్యతను, దేశ అభివృద్ధిలో వారి పాత్రను వివరించారు. ఈ ఏడాది సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి కావడం ప్రత్యేకంగా గుర్తు చేశారు. సివిల్ సర్వెంట్లు దేశానికి సేవ చేయడం ఎంతో గౌరవంగా భావిస్తూ, నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలనే పటేల్ దృక్కోణాన్ని మోదీ పునఃస్మరించారు.

ప్రజాసేవలో పరిపూర్ణత సాధించేందుకు నిరంతరం కృషి

“వికసిత్ భారత్” సాధనలో సివిల్ సర్వెంట్లు కీలకంగా వ్యవహరిస్తారని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజాసేవలో పరిపూర్ణత సాధించేందుకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న పలు విధానాల అమలులో సివిల్ సర్వెంట్ల ధ్యేయ నిష్టే దేశాన్ని అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. వారు ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండటం వల్ల, అభివృద్ధి యోజనలను సమర్థవంతంగా అమలు చేయగల శక్తి వారికి ఉందని చెప్పారు.

ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ స్ఫూర్తిదాయకం

సివిల్ సర్వీసులు కేవలం ఉద్యోగంగా కాకుండా, దేశ నిర్మాణంలో భాగంగా భావించాలని సూచించారు. ప్రతి ఒక్క సివిల్ సర్వెంట్ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తే, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “సేవాభావంతో కూడిన నిస్వార్థమైన నాయకత్వమే సుస్థిర అభివృద్ధికి బాటలు వేస్తుంది” అని ప్రధానమంత్రి మోదీ అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870