
ప్రేమికుల దినోత్సవం రోజున మూడు ప్రేమ కథా చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడం ఈ వారానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం మరోసారి ప్రేమికులను ఆకట్టుకోనుంది. గ్రామీణ నేపథ్యంతో, సామాజిక స్పృహ కలిగిన ప్రేమకథగా ఈ సినిమా అప్పట్లో మంచి స్పందన పొందింది.
Read Also: Thalapathy Vijay: ఒకే ఫ్రేమ్ లో వైఎస్ జగన్.. కోలీవుడ్ హీరో
ఈ మ్యాజిక్ను చూడటానికి ఉత్సాహంగా ఉన్నా
అదే రోజున దివంగత నటుడు ఉదయ్ కిరణ్ నటించిన ‘మనసంతా నువ్వే’ చిత్రం (Movie) కూడా మళ్లీ విడుదల కానుంది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్న ఈ సినిమాపై ఉదయ్ కిరణ్ మేనల్లుడు తేజ ఆనందం వ్యక్తం చేశారు. తాను చిన్నతనంలో ఈ సినిమా చూశానని, ఇప్పుడు మళ్లీ థియేటర్లలో ఈ మ్యాజిక్ను చూడటానికి ఉత్సాహంగా ఉన్నానని తేజ పేర్కొన్నారు.
కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ
2021 లో విడుదలై ఘనవిజయం అందుకున్న ఈ సినిమా (Movie) ఇప్పటికీ 90స్ కిడ్స్ కి ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ సినిమాను ఇష్టపడని ప్రేక్షకుడు దాదాపు లేరనే చెప్పాలి. ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్, తనూ రాయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో ప్రేమ, భావోద్వేగం, త్యాగం వంటి అంశాలను చాలా చక్కగా ఆవిష్కరించిన దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో భారీ సంచలనం సృష్టించి ఊహించని కలెక్షన్లను కూడా రాబట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: