కొన్నిసార్లు మనం మాట్లాడింది ఒకటి అయితే అది పదిమందికి చేరుకునేసరికి అసలుమాట్లాడింది కంటే కొసరిమాటలే ఎక్కువగా పాకిపోతాయి. సత్యం గడప దాటేసరికి అసత్యం ఊరంతా చుట్టేసుకుని వస్తుంది. అందుకే సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ప్రత్యేకంగా మీడియా సమావేశంలో ఏదీపడితే అలా మాట్లాడితే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ విషయంలో ఇదే జరిగింది. దీనికి సంబంధించిన పూర్తివివరాలు ఇలా ఉన్నాయి..
Read Also: Jobs: రంగారెడ్డి జిల్లాలో NUHM కింద 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

ఒకరోజు ముందే క్షమాపణలు
హీరో నాగార్జున(Nagarjuna) ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరోసారి క్షమాపణలు(Apologies) చెప్పారు తెలంగాణ(TG) మంత్రి కొండా సురేఖ.(Konda Surekha) దీనిపై కొండాసురేఖ మాట్లాడుతూ నటుడు నాగర్జున విషయంలో నేను మాట్లాడింది వేరు.. కానీ దాన్ని వివాదంగా చిత్రీకరించినట్లు ఆమె అన్నారు. దానితో నేను మనస్థాపం చెందాను అని.. అందుకే మీడియాతో ఓపెన్ గా ఉండటం లేదన్నారు.
కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావావేశారు. ఈ కేసు విచారణ రేపు కోర్టులో రానున్నది. దీంతో కొండా సురేఖ ఒకరోజు ముందేనాగార్జునకు క్షమాపణలు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: