టాలీవుడ్ లో కింగ్ నాగార్జున (Nagarjuna) తన సినీ జీవితంలో మరో మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కెరీర్లో వందో మూవీగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రేక్షకులు, అభిమానులు, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ చిత్రం సంబందించిన ఆసక్తికరమైన వివరాలు సోషల్ మీడియా (Social media) లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Ilayaraja: ఇళయరాజ స్టూడియో కి బాంబు బెదిరింపులతో పోలీసుల తనిఖీలు
ఇప్పటికే ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ ఖరారైనట్లు సమాచారం. ఈ టైటిల్ చుట్టూ ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. నాగార్జున (Nagarjuna) అభిమానులు, సినీ అభిమానులు ఈ టైటిల్ ను చూస్తే ఫిల్మ్ జోరుగా ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన టబు (Tabu) నటించబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో
‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం (‘Ninne Pelladatha’ movie) తో ఈ కాంబినేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం టబు ఈ సినిమాకి దూరమైనట్లు తెలుస్తోంది.

ఆమె ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, టబు తప్పుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. టబు స్థానంలో స్టార్ హీరోయిన్ నయనతార ను తీసుకోవాలని చిత్ర బృందం నిర్ణయించిందని సమాచారం.
స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులలో
ప్రస్తుతం నయనతార (Nayanthara) స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య నాగార్జున 100వ సినిమాలో నటించడానికి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ (Tollywood) వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. నాగార్జున, నయనతార గతంలో ‘బాస్’ అనే చిత్రంలో జంటగా నటించారు.నాగ్ (Nagarjuna) 100 మూవీ పట్ల ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నా టబు తప్పుకుందన్న వార్తతో మాత్రం వారు ఫీలవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: