చిన్న బడ్జెట్తో తెరకెక్కినా, విడుదలైన వెంటనే భారీ విజయాన్ని అందుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu)ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI)–2025లో ఈ సినిమాకు ప్రత్యేక ప్రదర్శన కల్పించారు. స్క్రీనింగ్కు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన లభించింది.

ముఖ్య పాత్రల్లో నటించిన
ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్(Banner)పై నిర్మించారు. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చారు. తక్కువ ఖర్చుతో చేసిన ఈ సినిమా కంటెంట్ శక్తితోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దేశీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ చిత్రం, పెద్ద వేదిక అయిన ఇఫీలో ప్రదర్శితమవడం పట్ల చిత్ర బృందం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: