
‘మత్తు వదలరా’ సినిమాతో టాలీవుడ్లో ఓ కొత్త తరహా కామెడీకి బీజం వేసిన కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా సాధించిన విజయంతో దర్శకుడు రితేష్ రానా, కమెడియన్ సత్య కలిసి మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈసారి సత్య పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జెట్లీ’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.‘మేడిపండు చూడ మేలిమై యుండును..’ అనే వేమన పద్యంతో ఈ గ్లింప్స్ ప్రారంభం అయ్యింది.
Read also: Mahesh Babu: పారిస్లో ‘వారణాసి’మూవీ టీజర్ విడుదల?
సినిమాపై అంచనాలను పెంచుతోంది
ఒక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సాగే ఈ కామెడీ సన్నివేశాలు గ్లింప్స్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. “నువ్వు ఏ టైర్ హీరోవి?” అని వెన్నెల కిషోర్ వేసిన ప్రశ్నకు, సత్య తనదైన శైలిలో “నేను జనరల్ కంపార్ట్మెంట్ హీరోని” అంటూ సమాధానం ఇవ్వడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని నిర్మాత చెర్రీ తెలిపారు. ‘మత్తు వదలరా’ సిరీస్ తర్వాత వస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులకు మరోసారి నాన్-స్టాప్ వినోదాన్ని పంచుతుందని దర్శకుడు రితేష్ రానా ధీమా వ్యక్తం చేశారు. ఇక వేసవి కానుకగా ‘జెట్లీ’ థియేటర్లలో సందడి చేయనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: