పృథ్వీరాజ్ సుకుమారన్ మరో విభిన్న కథతో.. ‘ధైరా’ పేరిట కొత్త ప్రయోగం
దక్షిణాది సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో సవాల్కు సిద్ధమవుతున్నారు. కేవలం హీరోయిజానికి సంబంధించిన సినిమాలు కాకుండా, విభిన్నమైన కథాంశాలను ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న ఈ నటుడు ఇప్పుడు నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఓ హృదయ విదారక కథను తెరపైకి తీసుకురానున్నారు. ఇప్పటికే ‘ఎల్ 2 ఎంపురాన్’తో దర్శకుడిగా ఘన విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ధైరా’ అనే సినిమా ద్వారా మరోసారి తన నటనకు కొత్తదనం ఇవ్వబోతున్నారు. పృథ్వీరాజ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించనున్న ఈ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. మేఘనా గుల్జార్, పృథ్వీరాజ్, కరీనా కపూర్ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
2019 హైదరాబాద్ దిశ ఘటన ఆధారంగా సినిమా?
ఈ సినిమా కథ నిజంగా 2019లో దేశవ్యాప్తంగా దుమారం రేపిన దిశ హత్య కేసు ఆధారంగా తెరకెక్కించబోతోందా? అనే చర్చ నేటి నెట్టింట విస్తృతంగా జరుగుతోంది. శంషాబాద్ సమీపంలోని ఓ ప్రాంతంలో యువతిని నలుగురు దుండగులు అత్యాచారం చేసి, అనంతరం కాల్చి చంపిన సంఘటన దేశమంతటా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన ప్రజలు ఆ సమయంలో ఆగ్రహంతో ఉలిక్కిపడ్డారు. తర్వాత ఈ నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయగా, ఇది మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ఈ కేసు ఆధారంగా సినిమా వస్తుందా అనే చర్చలు ఉండగా, ఇప్పుడు ‘ధైరా’ అనే టైటిల్తో వచ్చిన సినిమా ఇదే సంఘటన ఆధారంగా రూపొందించబడుతున్నట్టు సమాచారం. మేఘనా గుల్జార్ గత కొన్నాళ్లుగా ఈ ఘటనపై లోతుగా పరిశోధనలు చేశారని, సంఘటితమైన వాస్తవాలను వినిపించి సమాజానికి సందేశం ఇచ్చేలా సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేసినట్టు తెలుస్తోంది.
పృథ్వీరాజ్, కరీనా కపూర్ పాత్రలు ఎమోషనల్గా ఉండనున్నాయ్
ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోలీస్ అధికారిగా కనిపించే అవకాశముందని టాక్. ఆ ఘటన నేపథ్యంలో బాధితురాలి కోసం న్యాయం సాధించే పాత్రలో కనిపించనున్నారట. కరీనా కపూర్ పాత్ర కూడా అంతే శక్తివంతంగా ఉండనుందని సమాచారం. ఆమె బాధితురాలి తల్లిగా నటించే అవకాశం ఉందని సమాచారం. ఇద్దరి మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బలంగా తాకేలా ఉండబోతున్నాయంటున్నారు సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. నటీనటుల ఎంపిక, ఇతర సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
విభిన్న కథల కోసం ఎప్పుడూ ముందుండే పృథ్వీరాజ్
పృథ్వీరాజ్ సుకుమారన్ కెరీర్ మొత్తాన్ని పరిశీలిస్తే, ఆయన ఎప్పుడూ వేరొకదనాన్ని వెతుకుతూ ఉండే నటుడిగా కనిపిస్తారు. ‘ఎజ్రా’, ‘కూడ’, ‘ముంబాయి పోలీస్’, ‘లూసిఫర్’ వంటి చిత్రాల నుంచి ఇటీవల ‘సలార్’ వరకూ ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. దర్శకుడిగా కూడా ‘లూసిఫర్’, ‘బ్రో డాడ్’ వంటి సినిమాలు ఆయన ప్రతిభను బయటపెట్టాయి. ఇప్పుడు ‘ధైరా’ అనే సమాజంలో ప్రకంపనలు సృష్టించే కథను ఎంచుకోవడం చూస్తే, ఆయనను ఎందుకు ఒక ప్రయోగాత్మక నటుడిగా అభివర్ణిస్తారో అర్థం అవుతుంది.
READ ALSO: Allu Arjun: అల్లు అర్జున్ మరో ప్రాజెక్టులో ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరంటే?