Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’తో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించారు. దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లను సాధించి, సక్సెస్ ట్రాక్లోకి గ్రాండ్గా తిరిగి వచ్చారు. ఈ భారీ విజయం అందించిన ఉత్సాహంతో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్లో వేగం పెంచారు. అభిమానులను మరోసారి మాస్ యాక్షన్తో అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
Read Also: Peddi Movie Update: పెద్ది నుంచి ‘రై రై రా రా’ మాస్ సాంగ్ వచ్చేసింది

హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైనర్
దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన “దేఖ్ లేంగే సాలా..” అనే సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈ పాటతో సినిమా రేంజ్ ఏంటనేది అభిమానులకు అర్థమైపోయింది.
సెట్లో మాటల మాంత్రికుడి సందడి
తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ సెట్లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ప్రాణమిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అకస్మాత్తుగా సెట్స్లోకి ప్రవేశించి సందడి చేశారు. పవన్ కళ్యాణ్తో కలిసి త్రివిక్రమ్ ముచ్చటిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీరిద్దరి కలయిక చూస్తుంటే సినిమా అవుట్పుట్ విషయంలో త్రివిక్రమ్ తన వంతు సూచనలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: