పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ హారర్ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్ ’పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భారీ యాక్షన్, పీరియాడిక్ చిత్రాల తర్వాత ప్రభాస్ను పూర్తిగా వినోదాత్మక రోల్ లో చూపించనున్న సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read also: RanveerSingh: డాన్ 3కు మరో షాక్.. రణ్వీర్ సింగ్ తప్పుకున్నారా?
ఆసక్తికర ఫొటో
సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర ఫొటో పంచుకుంది. అందులో ఆమె ప్రభాస్ తో కలిసి చిరునవ్వులు చిందిస్తోంది. “ఇది ఏఐ ఫొటో కాదు” అంటూ నిధి (Nidhi Agarwal)క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పిక్ ను ప్రభాస్ ఫ్యాన్ప్ విశేషంగా లైక్ చేస్తున్నారు.

మొదట ఈ సినిమా రన్టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా వార్తలు రాగా, తాజాగా కొన్ని సన్నివేశాలను తొలగించి నిడివిని సుమారు 2 గంటల 55 నిమిషాలకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ మేకోవర్, నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందని దర్శకుడు మారుతి ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: