విజయవాడ : టాలీవుడ్ స్టార్ హీరో(Jr NTR) నందమూరి తారకరామారావు (జూనియర్ ఎన్టీఆర్) తాజాగా ఢిల్లీ(Delhi) హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, అలాంటి పోస్టులు క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా, సదరు ఖాతాలపై విచారణ జరిపి నిందితులపై మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించారు.
Read also: తిరుమల కల్తీ నెయ్యి కేసు: SIT కస్టడీకి ప్రధాన నిందితులు

సోషల్ మీడియాపై కోర్టు కఠిన ఆదేశాలు
ఎన్టీఆర్(Jr NTR) వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియా, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయని అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ తరపు న్యాయవాది జె. సాయిదీపక్ ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, 2021 ఐటీ చట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి నిందితులపై 3 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయా సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా ఉన్న అభ్యంతరకర పోస్టుల వ్యవహారంలో, సూచించారు. es అలాంటి పోస్టులను తొలగించాలని ముందుగా సోషల్ మీడియా సంస్థలను సంప్రదించాలని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ ఈ సందర్భంగా తర్వాతనే కోర్టును ఆశ్రయించాలని అన్నారు. అయితే గతంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవణ్కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురవ్వగా అప్పట్లో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాది ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: