Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ మరియు ప్రతిభావంతుడైన దర్శకుడు ఆదిత్య ధర్ కలయికలో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్-2’ విడుదలకు సిద్ధమైంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ను రేపు ఉదయం 11.01 గంటలకు లాంచ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also :Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్

రణ్వీర్ సింగ్ – ఆదిత్య ధర్ పాన్ ఇండియా సెన్సేషన్
ఈసారి మేకర్స్ ఈ చిత్రాన్ని కేవలం హిందీకే పరిమితం చేయకుండా, పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా ట్రైలర్తో పాటు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ భారీ యాక్షన్ డ్రామా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. దక్షిణాది మార్కెట్ను కూడా దృష్టిలో ఉంచుకుని మేకర్స్ ప్రమోషన్లను భారీగా ప్లాన్ చేస్తున్నారు.
గతంలో వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. మొదటి పార్ట్ సాధించిన భారీ విజయం నేపథ్యంలో, పార్ట్-2 అంతకంటే పెద్ద స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. రేపు విడుదల కాబోయే ట్రైలర్ ఈ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :