పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ అఖండ 2 : తాండవం’ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. శనివారం బోయపాటి శ్రీను (Boyapati Srinu) దిల్లీలో ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోహన్ భగవత్ ‘అఖండ 2’ ప్రయత్నాన్ని ప్రశంసించినట్లు చిత్రబృందం తెలిపింది. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన ఇలాంటి చిత్రాలు మరింతగా రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.
Read Also: Sunny Deol new movie : సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్కి గ్రీన్ సిగ్నల్!…
మాపై మరింత బాధ్యతని పెంచింది
దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.. “దేశం, ధర్మం, దైవం వంటి మనవైన మూల విలువల్ని నేటి తరానికి తెలియజెప్పాలనే సంకల్పంతోనే ‘అఖండ 2: తాండవం’ చిత్రాన్ని రూపొందించాం. మా ప్రయత్నానికి ఆర్.ఎస్.ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆశీర్వాదం లభించడం మా బృందానికి దక్కిన గౌరవం. ఇది మాపై మరింత బాధ్యతని పెంచింది” అని ఆయన అన్నారు. ఈ భేటీ సినిమాకు వస్తున్న ఆదరణకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చిందని సినీ వర్గాలు అంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: