బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss 9) శనివారం ఎపిసోడ్ నవ్వులు, భావోద్వేగాలు, పంచాయితీలతో సందడి చేసింది. ఎపిసోడ్ మొదటిలోనే దివ్య – తనూజ మధ్య జరిగిన గొడవపై నాగార్జున క్లాస్ పీకారు. ఇద్దరి మధ్య చోటు చేసుకున్న గొడవలపై హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఈ వారం హౌస్ నుండి దివ్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో కల్యాణ్, పవన్, ఇమ్మాన్యుయేల్, భరణి, సంజన, దివ్య నిలిచారు.
Read Also: Bigg Boss 9: పదకొండవ వారం ఫ్యామిలీ వీక్
ఇమ్మాన్యుయేల్కు మద్దతు
తొలిసారి నామినేషన్లలోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్కు ప్రేక్షకుల నుండి గట్టి మద్దతు లభించింది. ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, కల్యాణ్ మొదటి స్థానంలో, ఇమ్మాన్యుయేల్ రెండవ స్థానంలో నిలిచినట్లు సమాచారం. ఆ తర్వాత పవన్, భరణి సురక్షిత స్థానాల్లో ఉండగా, సంజన, దివ్య డేంజర్ జోన్లో ఉన్నారు.

అయితే, గత కొన్ని వారాలుగా హౌస్ (Bigg Boss 9) లో దివ్య ప్రవర్తనపై నెగిటివిటీ పెరిగింది. ముఖ్యంగా తోటి కంటెస్టెంట్ తనూజతో తరచూ గొడవ పడటం ఆమెకు ప్రతికూలంగా మారింది. శుక్రవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ విషయంలో కూడా వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ కారణాల వల్లే
మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే దివ్యకు తక్కువ ఓట్లు పోలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకవేళ ఈ వార్తే నిజమైతే, హౌస్లో కామనర్స్గా మిగిలేది కల్యాణ్, పవన్ మాత్రమే అవుతారు. అయితే, ఊహించినట్లుగా దివ్యనే నిష్క్రమిస్తుందా లేక చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
స్పెషల్ గెస్ట్గా నాగబాబు
మరోవైపు స్పెషల్ గెస్ట్గా నాగబాబు ఎంట్రీ ఇవ్వగా, ఆయనతో పాటు భరణి తల్లి కూడా రావడం హౌస్ను భావోద్వేగంతో నింపింది. వారిద్దరిని చూసిన భరణి ఆనందంతో కంటతడి పెట్టాడు.“నా గురువు – నా తల్లి వచ్చారు… దీనికంటే బెస్ట్ మూమెంట్ లేదు” అంటూ ఎమోషనల్ అయ్యాడు.నాగబాబు కూడా భరణితో తన అనుబంధం గురించి చెప్పారు. సీరియల్స్లో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ .. అప్పుడు భరణి చాలా అగ్రెసివ్… ఇప్పుడు బిగ్ బాస్ వల్ల గంగి గోవులా మారిపోయాడు! మరీ అంత సాఫ్ట్నెస్ అవసరం లేదు అని సరదాగా అన్నారు.
ఇక నాగార్జున ఇచ్చిన ఫొటోలలో టాప్ 5 గా భరణి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజనని పెట్టారు. ఆ తర్వాత ఓ బాక్స్ నుండి తీసిన ‘సినిమా క్యారెక్టర్స్’ను హౌస్మేట్స్కు మ్యాచ్ చేయమని అడగగా, నాగబాబు సరదాగా స్పందించారు. గజినీ – భరణి (ఏం చేయాలో మరచిపోతున్నాడని సెటైర్), హాసిని – రీతూ (ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందంటూ, కొన్నిసార్లు “ఎస్వీ రంగారావు మాయాబజార్లో నవ్వినట్టుంది” అని జోకు చేశారు).
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: