బిగ్బాస్ 9లో(Bigg Boss 9) ఈ వారం “బీబీ రాజ్యం” థీమ్లో టాస్కులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా బిగ్బాస్, కళ్యాణ్ను “మహారాజు”గా, దివ్య మరియు రీతూ చౌదరిలను “మహారాణులుగా” నియమించాడు. మిగతా సభ్యులను కమాండర్లు, ప్రజలుగా విభజించే బాధ్యతను ఈ ముగ్గురికి అప్పగించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో కమాండర్లుగా ఉన్న నిఖిల్, తనూజ, సంజన, డీమాన్లకు బిగ్బాస్ ఒక కొత్త టాస్క్ను అప్పగించాడు. “విన్ ఇట్ ఆర్ రిస్క్ ఇట్” పేరుతో ఈ టాస్క్లో కమాండర్స్ తమ స్థానాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడాలి. కమాండర్లు వెనుక బాస్కెట్ ధరించి, ఇతరుల బాస్కెట్లలో బాల్స్ వేయాలి. ఎవరి బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటాయో వారు గేమ్లో సేఫ్ అవుతారు.

Read Also: RGV: ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్పై స్పందించిన ఆర్జీవీ
టాస్క్ మొదలైన వెంటనే డీమాన్ లైన్ దాటడంతో తనూజ అతన్ని ఔట్గా ప్రకటించింది. కానీ సంచాలక్గా ఉన్న రీతూ మాత్రం “నెట్టారు, కావున మళ్లీ ఆడు” అంటూ మరో అవకాశం ఇచ్చింది. దీని వల్ల తనూజ అసహనం వ్యక్తం చేసింది. తర్వాత నిఖిల్, పవన్ మధ్య ఆటలో పవన్ లైన్ దాటగా రీతూ “ఫస్ట్ వార్నింగ్” అని చెప్పింది.
కమాండర్స్ టాస్క్లో గందరగోళం – రీతూ నిర్ణయాలపై వాదన
అయితే మిగిలిన హౌస్మేట్స్ రీతూ డబుల్ స్టాండర్డ్గా వ్యవహరిస్తోందని ప్రశ్నించగా,(Bigg Boss 9) ఆమెకు ఏం చేయాలో తెలియక “అందరూ ఆడండి” అంటూ ఆటను కొనసాగించింది. ఈ నిర్ణయంపై సంజన తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. “అతన్ని ఎలిమినేట్ చేయాలి” అని సంజన అరిచింది. దీనికి ప్రతిగా రీతూ, “మీరు నాకు చెప్పక్కర్లేదు, నేను సంచాలక్, నాకు ఏం చేయాలో తెలుసు” అని సమాధానమిచ్చింది.
సంజన తన స్ట్రాటజీపై రీతూ వ్యాఖ్యానించడంతో వాదన మరింత రగిలింది. “నా గేమ్పై నువ్వు మాట్లాడే హక్కు లేదు” అని సంజన ఫైర్ కాగా, రీతూ “నేను ఇక్కడ సంచాలక్ని, గేమ్ రూల్స్ నాకు తెలుసు” అంటూ సమాధానమిచ్చింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోవడంతో హౌస్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణతో “బీబీ రాజ్యం” టాస్క్ హౌస్లో హాట్ టాపిక్గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: