నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్లో ప్రత్యేకమైన ఉత్సాహం, అంచనాలు ఉంటాయి. సింహ, లెజెండ్, అఖండ వంటి సంచలన బ్లాక్బస్టర్ల తర్వాత మళ్లీ ఈ కలియకలో, రూపొందిన చిత్రం,‘అఖండ 2: తాండవం’పై (Akhanda 2) దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, మ్యూజిక్ అప్డేట్లు ప్రేక్షకుల్లో ఉత్సాహం పుట్టించగా బాలయ్య ఆఘోర అవతారంలో కనిపించిన సన్నివేశాలు అఖండ ఫ్రాంచైజీ స్థాయిని మరో లెవెల్కు తీసుకెళ్లాయి. ఈ (Akhanda 2) చిత్రం పాన్ ఇండియా రేంజ్లో డిసెంబర్ 5న గ్రాండ్గా విడుదల కావాల్సి ఉండగా నిర్మాతలు ఊహించని షాకిచ్చారు.
Read Also: Prabhas: ‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్
కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది
కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ముందుగా ప్రకటించిన తేదీకి విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నిన్న రాత్రి సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది.కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదు. ఇది మాకు కూడా ఎంతో బాధ కలిగించే విషయం.

సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతీ అభిమాని నిరాశను మేము అర్థం చేసుకోగలం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. ఈ జాప్యానికి, అసౌకర్యానికి ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు వివరించింది. “మీ మద్దతే మాకు కొండంత బలం. త్వరలోనే ఒక సానుకూల అప్డేట్తో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాం,” అని నిర్మాతలు తమ ప్రకటనలో భరోసా ఇచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: