నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం డిసెంబర్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే.’అఖండ 2′ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై అంచనాలకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏకంగా 1,13,000 టికెట్లు అమ్ముడవగా,
Read Also: Dhurandhar Movie: వివాదానికి దారితీసిన హృతిక్ వ్యాఖ్యలు

‘అఖండ 2’ హవా
కేవలం హైదరాబాద్ నగరంలోనే ‘బుక్ మై షో’ (‘Book my show’) ద్వారా తొలిరోజు అడ్వాన్స్ బుకింగ్స్ విలువ రూ. 3 కోట్లు దాటింది. ఇంకా ప్రీమియర్ షోల బుకింగ్స్ మొదలుకాలేదు. ఈ ట్రెండ్ చూస్తుంటే, నైజాం ఏరియాలో ఒక సీనియర్ హీరో సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ‘అఖండ 2’ (Akhanda 2) హవా కనిపిస్తోంది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ ప్రీ-సేల్స్ గ్రాస్ సుమారు రూ. 15.5 కోట్లను అధిగమించింది.
ఇవి కేవలం ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా వచ్చిన లెక్కలు మాత్రమేనని, ఆఫ్లైన్ అమ్మకాలను కూడా కలిపితే తొలిరోజు వసూళ్లు భారీ స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి వాయిదా పడిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: