Priyamani: టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్లి, వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్న నటి ప్రియమణి ఇప్పుడు హాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్లో ఆమె ప్రధాన పాత్రకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చిత్రంలో బాలీవుడ్ నటుడు మోహిత్ రైనాతో కలిసి నటించనుంది.
Read Also: Nandamuri TarakaRatna: తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

మోహిత్ రైనాతో కలిసి చిత్రంలో నటించనున్న టాలీవుడ్ స్టార్
ఈ చిత్రానికి హర్ష్ మహదేశ్వర్ దర్శకత్వం వహించనుండగా, అమెరికాకు చెందిన రెడ్ బైసన్ ప్రొడక్షన్స్తో పాటు ముంబైకి చెందిన అజూర్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించాయి.
సినిమా కథ భారతీయ–అమెరికన్ సంస్కృతుల నేపథ్యంతో, ఒక వలస కుటుంబం అనుభవించే భావోద్వేగ ప్రయాణాన్ని ఆధారంగా రూపొందుతోంది. హాలీవుడ్ హిట్ చిత్రాల్లో పని చేసిన ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: