Anushka-ప్రముఖ నటి అనుష్క శెట్టి తన అభిమానులను(Fans) ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం పాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని చెబుతూ అనుష్క తన చేతిరాతలో రాసిన ఒక నోట్ను సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
“బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్కి…”
ఆమె రాసిన నోట్లో, “బ్లూ లైట్ నుంచి క్యాండిల్ లైట్కు మారుతున్నాను. స్క్రోలింగ్కు(scrolling) అతీతంగా ఉన్న నిజమైన ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ కావడానికి కొంత విరామం తీసుకుంటున్నాను” అని పేర్కొన్నారు. అభిమానులకు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని సందేశమిచ్చిన ఆమె, త్వరలోనే మరిన్ని కథలతో తిరిగి వస్తానని తెలిపారు.

‘ఘాటి’ సినిమా తరువాత
ఇటీవల అనుష్క నటించిన ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. విక్రమ్ ప్రభుతో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు మిశ్రమ స్పందన లభించింది. అయితే అనుష్క నటనకు మాత్రం విశేషమైన ప్రశంసలు వచ్చాయి. సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొన్న ఆమె, విడుదలైన కొద్దిరోజుల్లోనే సోషల్ మీడియాకు విరామం ప్రకటించడం గమనార్హం.
కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి
‘ఘాటి’ ప్రమోషన్లలో మాట్లాడుతూ అనుష్క పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా, పూర్తి స్థాయి నెగెటివ్ పాత్రలో నటించాలని తన కోరికను వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త కథలు వింటున్నానని, మంచి ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. తన తొలి మలయాళ సినిమా సహా, త్వరలోనే కొత్త తెలుగు సినిమా ప్రకటన ఉంటుందని వెల్లడించారు.
అనుష్క శెట్టి ఎందుకు సోషల్ మీడియాకు విరామం తీసుకున్నారు?
నిజమైన ప్రపంచంతో మళ్లీ కనెక్ట్ కావడానికి, స్క్రోలింగ్కు విరామం ఇవ్వాలని ఆమె నిర్ణయించారు.
అనుష్క చివరగా నటించిన సినిమా ఏది?
ఘాటి సినిమా, ఇది సెప్టెంబర్ 5న విడుదలైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Telugu News: Attack- నేపాల్ లో భారతీయుల బస్సుపై దాడి తృటిలో తప్పించుకున్న భక్తులు