తెలంగాణలో బీఆర్ఎస్ పాలన సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, దర్శక నిర్మాతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ (Film Chamber) ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ (Bharat Bhushan) పేరు ఈ వివాదంలో బయటికి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఆయన ఫోన్ ట్యాపింగ్కు గురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.
సిట్ విచారణకు హాజరైన భరత్ భూషణ్
ఈ ఆరోపణల నేపథ్యంలో భరత్ భూషణ్ నిన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. ఎన్నికలు ముగిసే వరకు ఆయన సంభాషణలపై నిఘా కొనసాగినట్టు తెలుస్తోంది.సిట్ అధికారులు ఈ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తున్నారు. ట్యాపింగ్ వెనుక అసలు ఉద్దేశమేమిటో తెలుసుకోవడానికి భరత్ భూషణ్ నుంచి సమగ్ర సమాచారం సేకరించారు. రాజకీయంగా లేదా వ్యాపార ప్రయోజనాల కోసమా ఈ చర్చల నిఘా జరగిందన్నది దర్యాప్తులో తేలాల్సిన అంశం.
అప్పటి బాధ్యత… ఇప్పటి గౌరవ పదవి
ట్యాపింగ్ జరిగినప్పుడు భరత్ భూషణ్ ఒక డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే ఉన్నారు. కానీ 2024 జూలై 28న ఆయన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడీ వివాదం బయటకు రావడంతో సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన నెలకొంది.
Read Also : Delhi : ఢిల్లీలో మోతీనగర్లో భారీ అగ్నిప్రమాదం