हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

సీఐడీ పీటీ వారెంట్‌.. పోసాని విడుదలకు బ్రేక్‌

sumalatha chinthakayala
సీఐడీ పీటీ వారెంట్‌.. పోసాని విడుదలకు బ్రేక్‌

కర్నూలు : నటుడు పోసాని కృష్ణమురళి కి బెయిల్ మంజూరు అయింది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటి వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్‌లో సీఐడీ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సీఐడీ పోలీసుల పీటి వారెంట్‌తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.

సీఐడీ పీటీ వారెంట్‌ పోసాని

వారం రోజులపాటు తమ కస్టడీకి

మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్‌పై పోసానిని తీసుకువచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం రెండు రోజులపాటు(ఈ నెల 8, 9 తేదీల్లో) పోసానిని నరసరావుపేట 2 టౌన్‌ పోలీసుల కస్టడీకి అనుమతించింది.

ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసాని

అయితే, ఆ రెండు రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడంతో పోలీస్‌ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదే విధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్‌ లభించింది. ఆదోని అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఇన్‌చార్జి మెజిస్ర్టేట్‌ అపర్ణ మంగళవారం బెయిల్‌ ఆదేశాలు జారీ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

ఆస్తుల పర్యాటక లీజుపై ప్రత్యేక కమిటీ..

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

అందరి చూపు రవికుమార్ ఆస్తులపైనే!

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ఉప్పాడ మత్స్యకారుల శిక్షణ పూర్తి

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

📢 For Advertisement Booking: 98481 12870