చైనా ప్రభుత్వం (Chinese government) భారత్ సరిహద్దు సమీపంలో ఒక వ్యూహాత్మక రైల్వే లైన్ను నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం టిబెట్ ప్రాంతాన్ని షిన్జియాంగ్ ప్రావిన్సుతో అనుసంధానం చేయడం. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో కొంత భాగం వాస్తవాధీన రేఖ (Line of Actual Control – LAC) సమీపంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ నిర్మాణం చైనాకు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ముఖ్యంగా టిబెట్, షిన్జియాంగ్ ప్రాంతాల మధ్య రవాణాను మెరుగుపరచడం, ఆయా ప్రాంతాలపై తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.
నూతన కంపెనీ ఏర్పాటు, భారీ పెట్టుబడి
ఈ భారీ రైల్వే ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా ప్రభుత్వం ‘షిన్జియాంగ్-టిబెట్ రైల్వే కంపెనీ’ని రిజిస్టర్ చేసింది. దీని కోసం చైనా రూ.1.15 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని కేటాయించిందని వార్తలు వస్తున్నాయి. ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక కథనం ప్రకారం, ఈ రైల్వే లైన్ పనులు ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ భారీ పెట్టుబడి, ప్రత్యేక కంపెనీ ఏర్పాటుతో చైనా ఈ ప్రాజెక్టుకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోంది.
భద్రతపై ఆందోళనలు
చైనా చేపట్టిన ఈ రైల్వే లైన్ నిర్మాణం భారత సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉండటంతో, దీనిపై భారత్ నిఘా పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో భారత్కు భద్రతా పరంగా సవాళ్లను సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో చైనా సైనిక, లాజిస్టికల్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి ఈ రైల్వే లైన్ ఉపయోగపడవచ్చు. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం చైనా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Read Also : TDP MPS : మోదీ, అమిత్ షాతో టీడీపీ ఎంపీల భేటీ