हिन्दी | Epaper

India – Pakistan War : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా..? చైనా సమాధానం ఇదే !

Sudheer
India – Pakistan War : భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు సాయం చేశారా..? చైనా సమాధానం ఇదే !

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం, పాకిస్థాన్‌కు చైనా సైనిక సహాయం (China’s military Help to Pakistan) అందించిందా అనే ఊహాగానాలు అంతర్జాతీయంగా చర్చకు తెరతీశాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన క్షిపణుల దాడులు జరిపింది. ఈ దాడులపై చైనా తరపున స్పందించిన విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ తాము తటస్థంగా వ్యవహరిస్తామని తెలిపారు.

మావో నింగ్ క్లారిటీ

మావో నింగ్ మాట్లాడుతూ.. “భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలపై మేము ఎప్పటికీ తటస్థంగా ఉన్నాం. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం. కాల్పుల విరమణ ఒప్పందానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. అలాగే ప్రాంతీయ శాంతి, సుస్థిరత కోసం చైనా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో చైనా పాకిస్థాన్‌కు సైనిక సహాయం అందించిందన్న ఆరోపణలను పరోక్షంగా ఖండించినట్లు కనిపిస్తోంది.

చైనా ఈ వివాదంలో ఎటు తేల్చుకోలేకపోతుంది

ఇక పాకిస్థాన్ తన వద్ద చైనా నుంచి పొందిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వంటి గగనతల రక్షణ వ్యవస్థలపై బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నప్పటికీ, భారత ఆపరేషన్‌ సిందూర్‌లో వాడిన క్షిపణులను అవి అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఈ పరిణామంతో, చైనా రక్షణ వ్యవస్థల సమర్థతపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తంగా, చైనా ఈ వివాదంలో తటస్థంగా ఉన్నామన్న సూత్రాన్ని పునరుద్ఘాటించినప్పటికీ, పాకిస్థాన్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని పక్కనపెట్టలేదన్న అభిప్రాయాలు విశ్లేషకులవద్ద వినిపిస్తున్నాయి.

Read Also : Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

50 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన వోక్స్‌వ్యాగన్

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

మొజ్తాబా ఖ‌మేనీ సుర‌క్షితంగా ఉన్నారు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడులు.. నలుగురికి గాయాలు

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

చమురు ధరల మంట..వర్క్ ఫ్రమ్ హోంకు పెరుగుతున్న డిమాండ్

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు..ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

తన కూతురితో కలిసి క్రూయిజ్ క్షిపణి పరీక్షలను వీక్షించిన కిమ్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆరోగ్యంపై పెరుగుతున్న ఊహాగానాలు

📢 For Advertisement Booking: 98481 12870