China అరుదైన ఖనిజాల ఎగుమతులు నిలిపివేత – అమెరికాపై తీవ్ర ప్రభావం
వాషింగ్టన్, ఏప్రిల్ 15: అమెరికా- China మధ్య సుంకాల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ China ఉత్పత్తులపై టారిఫ్లను 145 శాతానికి పెంచగా, దానికి ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధించింది. దీని తాలూకుగా అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాలు, లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని బీజింగ్ నిలిపివేసింది.ఈ చర్యకు అమెరికా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. చైనా తీసుకున్న నిర్ణయం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఆయుధాల తయారీ, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్ల రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా అధ్యక్ష ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ ప్రకారం, ఈ అరుదైన ఖనిజాలు డిఫెన్స్ కాంట్రాక్టర్లకు అత్యవసరమయ్యే ముడిపదార్థాలు. చైనా సరఫరా ఆపేసిన నేపథ్యంలో అమెరికా అంతర్గత నిల్వలు సరిపోవని చెబుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో సుమారు 90 శాతం చైనాలోనే ఉత్పత్తవుతాయి. చైనా ఈ రంగాన్ని ఆయుధంగా మార్చుకుని అమెరికాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే యాపిల్, టెస్లా, లాక్హీడ్ మార్టిన్ వంటి అమెరికా దిగ్గజ సంస్థలు చైనాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఎగుమతులు నిలిపివేయడంతో వీటికి తీవ్రమైన విఘాతం కలగనుంది

China నిర్ణయంతో అమెరికా పరిశ్రమలు కుదేలవుతాయా
ఇప్పటికే చైనా ఎక్స్పోర్ట్ లైసెన్స్లను పరిమితం చేయనుందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం చైనాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు. కానీ, ఈ ఒత్తిడి పరిస్థితి తక్షణంగా పరిష్కారమయ్యేలా కనిపించదు.సుంకాల విషయంలో రెండు దేశాల నిర్ణయాలు గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చైనాతో వాణిజ్య సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా, ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా సరఫరా చెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడుతున్న దేశాలకు ఇది హెచ్చరికగా మారింది.ఈ నేపథ్యంలో, రెండు దేశాల మధ్య దౌత్యం, వ్యాపార ఒప్పందాల ప్రాముఖ్యత మరింత పెరిగింది. వాణిజ్య యుద్ధం ఎలా ముగుస్తుందనేది ఆసక్తికర అంశం కానుంది.
Read more :
Trade War: చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్