చైనా (China) మరోసారి మాస్ ప్రాజెక్ట్తో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. శనివారం టిబెట్లో బ్రహ్మపుత్ర నది (Brahmaputra River in Tibet) పై అత్యంత ఖరీదైన జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి చైనా ప్రధాని లి కియాంగ్ హాజరయ్యారు. స్థానిక మీడియా ఇది ధ్రువీకరించింది.యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును డిసెంబర్లో చైనా ఆమోదించింది. నదిపై భారీ ఆనకట్ట నిర్మించడానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుతో దేశంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ పంపిణీ చేయనుంది. టిబెట్ ప్రాంత ప్రజలకు విద్యుత్ అవసరాలు తీరుతాయని చైనా చెబుతోంది.

చైనాపై భారత్, బంగ్లాదేశ్ అభ్యంతరం
ఈ ప్రాజెక్టు డ్రాగన్ దేశం చేపట్టిన తీరు భారత్, బంగ్లాదేశ్కి ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ఈ రెండు దేశాల్లోనూ ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల లక్షల మంది దిగువ ప్రాంత ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. చైనా మాత్రం ఎలాంటి చర్చలు లేకుండానే ముందుకెళ్తోంది.
జనవరిలోనే ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసిందని భారత్ తెలిపింది. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. బ్రహ్మపుత్ర ప్రవాహం తగ్గకుండా చూడాలని చైనాను కోరింది. ఎలాంటి ప్రతికూల ప్రభావం రాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
పర్యావరణ హాని పై పక్కా హెచ్చరికలు
ఈ మెగా ప్రాజెక్టుపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. టిబెట్ పీఠభూమి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతం. ఇలాంటి ప్రాజెక్టులు దీర్ఘకాలిక ముప్పుగా మారతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇది దిగువన ఉన్న జీవవైవిధ్యం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా ఐదు జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించనుంది. మొత్తం ఖర్చు సుమారు 1.2 ట్రిలియన్ యువాన్లు. అంటే దాదాపు ₹14 లక్షల కోట్లు. ఇది చైనా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది.
Read Also : Vietnam Boat Accident : వియత్నాంలో పడవ బోల్తా పడి 34 మంది మృతి