అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్

China Tariff : దెబ్బకు దెబ్బ..అమెరికాపై 34శాతం సుంకాలు విధించిన చైనా

China Tariff : అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంలో చైనా దెబ్బకు దెబ్బ అంటూ సంకేతాలు పంపింది. ఈ మేరకు తాజాగా వాషింగ్టన్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం టారిఫ్‌లను విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఏప్రిల్‌ 10వ తేదీ ఇది అమల్లోకి రానున్నట్లు చెప్పింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై ఇది వర్తిస్తుందని ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. వాషింగ్టన్‌ చర్యలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. ఏకపక్షంగా ఆర్థిక బెదిరింపులకు పాల్పడుతోందని వెల్లడించింది.

Advertisements
దెబ్బకు దెబ్బ అమెరికాపై 34శాతం

ఏప్రిల్‌ 10 మొదలు అదనపు సుంకాలు

చైనాలోని టారిఫ్‌ చట్టం, కస్టమ్స్‌ చట్టం, విదేశీ వ్యాపార చట్టం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల ప్రకారం స్టేట్‌ కౌన్సిల్‌ ఆమోదంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఏప్రిల్‌ 10 మొదలు అదనపు సుంకాలు విధిస్తున్నాం అని ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయంతో ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతులపై ఉన్న పన్నులకు అదనంగా ఈ టారిఫ్‌లు కూడా విధించనున్నారు. కానీ, ఇప్పటికే అమల్లో ఉన్న పన్ను, ఇతర మినహాయింపు పాలసీలు కూడా కొనసాగనున్నాయి. మార్గం మధ్యలో ఉన్న సరకులు మే 13లోపు చేరుకొంటే.. వాటికి మాత్రం మినహాయింపు లభించనుంది.

సుమారు 438 బిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి

కాగా, నిన్న ట్రంప్‌ 34శాతం అదనపు సుంకాలను విధించడంపై బీజింగ్‌ తీవ్రంగా స్పందించింది. తాము తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పేర్కొంది. చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు 438 బిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. ఇక, అమెరికాతో వాణిజ్య చర్చలపై చైనా స్పందిస్తూ.. తాము వాణిజ్య ఆందోళనలపై వాషింగ్టన్‌తో టచ్‌లో ఉన్నామని చెప్పారు. సమ హోదాలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకొంటామని బీజింగ్‌ వెల్లడించింది.

Related Posts
SLBC : ఎస్ఎల్‌బీసీ సొరంగంలో వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ
SLBC ఎస్ఎల్‌బీసీ సొరంగంలో వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ

నాగార్జునసాగర్ ఎస్ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం నాటి నుంచి ఇప్పటివరకు 50 రోజుల పైగా గడిచినా, సహాయక చర్యలు మాత్రం నిమిషం కూడా ఆగకుండా కొనసాగుతున్నాయి. జీవితం Read more

గిరిజన బిడ్డను రాజకుటుంబం అవమానించింది: ప్రధాని
Tribal child insulted by royal family.. PM Modi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. 'గిరిజన ఆడబిడ్డ'ను 'రాజకుటుంబం' అవమానించిందని తప్పుపట్టారు. ఢిల్లీలోని Read more

ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అండగా ఉంటుంది: నెతన్యాహు
benjamin netanyahu solidarity message to iranians

benjamin-netanyahu-solidarity-message-to-iranians ఇజ్రాయెల్‌: హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్‌ పౌరులకు Read more

ఆర్జీ కర్ తీర్పుపై అసంతృప్తి: మమతా బెనర్జీ
ఆర్జీ కర్ తీర్పుపై అసంతృప్తి మమతా బెనర్జీ1

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్జీ కార్ కేసులో మరణశిక్ష పొందడం కుదరలేదన్న విషయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ఈ కేసును సిబిఐకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×