చిన్నారికి చిత్రహింస.. వీడియో వైరల్

Baby care centre: చిన్నారికి చిత్రహింస.. వీడియో వైరల్

తమిళనాడు రాష్ట్రంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. తేనీలోని ఒక ప్రైవేటు షెల్టర్ హోమ్ లో ఓ చిన్నారిని చెత్త డబ్బాలో వేసి చిత్రహింసలు పెడుతూ భయభ్రాంతులకు గురిచేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలలోకి వెళితే…
పైశాచిక చర్యలు
చిన్నారికి చిత్రహింస.. వీడియో వైరల్ ఒక ప్రైవేటు పిల్లల హోమ్ లో ఒక పసిబిడ్డ ను చెత్త డబ్బాలో వేసి పైకి కిందికి ఊపుతూ ఆ డబ్బాను దొర్లిస్తున్నట్లుగా, ఇద్దరు సిబ్బంది చేసిన చర్యలు ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేశాయి. ఒకటిన్నర ఏళ్ల చిన్నారి భయపడుతూ ఏడుస్తున్న వదిలిపెట్టకుండా ఇద్దరు అమ్మాయిలు డస్ట్ బిన్ ను ఉయ్యాలలా ఊపుతూ చేసిన పైశాచిక చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డే కేర్ హోంలో దారుణ ఘటన
డే కేర్ హోంలో దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తేనిలో జేజే ప్రొజెడీస్ లో జరిగిన ఈ సంఘటనలో ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు సహజంగా పిల్లలను ఈ ప్రైవేట్ హోమ్ డే కేర్ హోంలో వదిలి వెళ్లి సాయంత్రం జాబ్ పూర్తయిన తర్వాత తిరిగి ఇళ్లకు తీసుకువెళ్తారు. ఈ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత షెల్టర్ ఇస్తున్న సిబ్బంది పైన ఉంటుంది. ఈ హోం ను జెన్నీఫర్ అనే మహిళ నిర్వహిస్తోంది. చెత్తబుట్టలో చిన్నారిని ఉంచి భయభ్రాంతులకు గురి చేసిన సిబ్బంది అయితే ఈ హోమ్ లో జరిగినటువంటి దారుణ ఘటన అక్కడి సిబ్బంది పైశాచికత్వానికి నిదర్శనంగా నిలిచింది. పిల్లవాడిని పడేసినట్టు చెత్త డబ్బాలో వేసి అటు ఇటు ఊపుతూ పసికందు ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా వారు పైశాచికానందాన్ని పొందారు. ఇది చూసిన ప్రతి ఒక్కరు తీవ్రంగా కలత చెందారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జిల్లా బాలల రక్షణ విభాగానికి దీనిపైన ఫిర్యాదు చేశారు.

Advertisements

రంగంలోకి జిల్లా బాలల రక్షణ సిబ్బంది
రంగంలోకి జిల్లా బాలల రక్షణా విభాగం జిల్లా బాలల రక్షణ విభాగానికి సంబంధించిన సిబ్బంది హోమ్ ను సందర్శించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. అయితే గత నాలుగు నెలల క్రితమే ఈ వీడియో రికార్డు చేయబడిందని, కానీ ప్రస్తుతం వైరల్ గా మారుతుందని అక్కడి సిబ్బంది తెలిపారు. పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా సిబ్బంది ఇలా ప్రవర్తించినట్టు వారు పేర్కొన్నారు. ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు అయితే వారిచ్చిన వివరణ బాలల సంరక్షణ విభాగానికి చెందిన అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయం పైన సమగ్ర దర్యాప్తు కొనసాగుతుంది. హోమ్స్ లో పిల్లలపైన ఈ విధమైన చిత్రహింసలకు గురి చేయడానికి ప్రయత్నించే వారిని సహించకూడదని, బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ

ఎల్ 2 ఎంపురాన్ సినిమా పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి మల్లికా సుకుమారన్ సైతం ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. ఎల్ Read more

ఢిల్లీలో AQI 273కి చేరింది, అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన..
delhi aqi

న్యూ ఢిల్లీ వాయు నాణ్యత సూచిక (AQI) సోమవారం ఉదయం 8 గంటల సమయంలో 273 వద్ద నమోదయ్యింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ప్రకారం Read more

IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!
IPL2025: ఈ రోజు ఐపీఎల్ లో డబల్ ధమాకా..ఫ్యాన్స్‌కి పండగే!

క్రికెట్ అభిమానులకు ఈ రోజు పండగే. ఐపీఎల్ 2025లో భాగంగా ఈ రోజు డబుల్ హెడర్స్ జరగనుండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.మధ్యాహ్నం ఒక మ్యాచ్, రాత్రి మరో Read more

కునో నేషనల్ పార్కులోకి మరో 5 చిరుతలు
Kuno National Park

మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన "జ్వాల" అనే చిరుతను, దాని నాలుగు కూనల్ని అధికారులు పార్క్‌లోకి ప్రవేశపెట్టారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×