Albendazole tablet

ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది

Advertisements

అల్లూరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారి రస్మిత అనుకోని విధంగా మృతి చెందింది. నులిపురుగుల నివారణ కోసం ఇచ్చే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సాధారణంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పిల్లలకు నులిపురుగుల నివారణ ట్యాబ్లెట్ అందిస్తారు. అయితే అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడంతో చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. తల్లిదండ్రులు తక్షణమే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందింది.

Child died


ఈ ఘటనతో చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్యాబ్లెట్ ఇచ్చే ముందు పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం, సరిగ్గా తీసుకోవాల్సిన సమయం గురించి అవగాహన కల్పించడం కీలకమని డాక్టర్స్ అంటున్నారు. చిన్నారి మృతికి కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

Related Posts
Seethakka : అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మంత్రి సీతక్క వ్యాఖ్యలు
Seethakka అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మంత్రి సీతక్క వ్యాఖ్యలు

Seethakka : అక్బరుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి మంత్రి సీతక్క వ్యాఖ్యలు తెలంగాణ మంత్రిగా ఉన్న సీతక్క శాసనసభ వేదికగా తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. "నేను తెలుగు Read more

ఎయిమ్స్‌కు ప్రశాంత్ కిషోర్ తరలింపు
Prashant Kishor hunger strike broken.. Forced transfer to AIIMS

పాట్నా: బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాజకీయ వ్యూహకర్తగా ఉన్న Read more

రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ
Free fry distribution from 1 1

అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, Read more

గవర్నర్ ప్రసంగంలో దశ, దిశ లేదన్న హరీశ్ రావు
Harish Rao says there is no direction or direction in the Governor's speech

హైదరాబాద్‌ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే Read more

×