हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Dates: రక్త హీనతను తగ్గించే ఖర్జురా

Sharanya
Dates: రక్త హీనతను తగ్గించే ఖర్జురా

ఖర్జూరం తీయటి రుచికి, మెత్తటి స్పర్శకు ప్రసిద్ధి. పోషక విలువలు అధికంగా ఉండటంతో ఖర్జూరాన్ని ఎడారి ప్రాంతపు బంగారం అని కూడా పిలుస్తారు. ఇది తక్షణ శక్తిని అందించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ప్రతి ఆహార పదార్థం లానే ఖర్జూరానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో ఖర్జూరం తినకూడదు లేదా పరిమితంగా తీసుకోవడం మంచిది.

అతిగా ఖర్జూరం తీసుకోవడంలో ఎదురయ్యే సమస్యలు

మధుమేహం ఉన్నవారు జాగ్రత్త

ఖర్జూరంలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి షుగర్స్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఖర్జూరం తింటే రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరిగి, రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ అస్థిరంగా మారే ప్రమాదం ఉంది. మధుమేహం ఉన్నవారు ఖర్జూరాన్ని పూర్తిగా మానేయకపోతే, రోజుకు 1-2 ఖర్జూరాలకంటే ఎక్కువ తినకూడదు. తినే ముందు వ్యాయామం చేయడం లేదా ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారంతో మిళితం చేయడం మంచిది. తినే ముందు వైద్యుడి సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

ఊబకాయం (అధిక బరువు) ఉన్నవారు

ఖర్జూరంలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఒక్కో ఖర్జూరం సుమారు 20-25 కేలరీలు కలిగి ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు, బరువు తగ్గే ప్రయత్నం చేసే వారు ఖర్జూరం ఎక్కువగా తింటే కేలరీల పరిమితి దాటిపోయి బరువు పెరిగే ప్రమాదం ఉంది. బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నవారు రోజుకు 2-3 ఖర్జూరాలకు మించకూడదు. ఖర్జూరాన్ని బాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా తీసుకోవాలి. రాత్రివేళ ఖర్జూరం తినడం తగ్గించాలి, ఎందుకంటే ఆ సమయంలో శరీరం తక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది.

మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు

ఖర్జూరంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, కానీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు అధిక పొటాషియం తీసుకుంటే ప్రమాదం ఉంటుంది. హైపర్‌కలేమియా అంటే రక్తంలో అధికంగా పొటాషియం చేరడం. ఇది గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనత, కండరాల నొప్పులు వంటి సమస్యలకు దారి తీస్తుంది. మూత్రపిండాలు బలహీనంగా ఉన్నవారు అధిక పొటాషియం తీసుకున్నప్పుడు, శరీరం దాన్ని సరిగా బయటకు పంపలేకపోతుంది. మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఖర్జూరం తీసుకునే ముందు డాక్టర్‌తో సంప్రదించాలి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి.

జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు

ఖర్జూరం తిన్న తర్వాత కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉండటంతో, ఇది కొన్ని మందికి జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు ఖర్జూరం తిన్న వెంటనే అసౌకర్యంగా అనిపించవచ్చు. మరికొందరికి అలర్జీ రియాక్షన్ కూడా కలిగించే అవకాశం ఉంది. రోజుకు 2-3 ఖర్జూరాలకు మించకుండా తినడం మంచిది.

చిన్న పిల్లలు అధికంగా తినకూడదు

చిన్న పిల్లలు 2 సంవత్సరాల లోపు ఉంటే జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. ఖర్జూరంలోని అధిక ఫైబర్, సహజ చక్కెరలు కడుపు నొప్పి లేదా విరేచనాలు కలిగించే అవకాశం ఉంది. 2 సంవత్సరాల లోపు పిల్లలకు ఖర్జూరం చాలా తక్కువగా ఇవ్వాలి. పిల్లలు 6-7 ఏళ్ల వయస్సుకు వచ్చిన తర్వాత మాత్రమే పరిమితంగా తినాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870