vijayawada parking fee

Parking fees : పార్కింగ్ ఫీజుల దోపిడీకి చెక్

విజయవాడ నగరంలో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజులపై మున్సిపల్ కమిషనర్ థ్యాన్ చంద్ర కఠిన చర్యలకు పూనుకున్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఉత్తర్వులను అనుసరిస్తూ ఆయన స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. పార్కింగ్ ఫీజుల పేరుతో ప్రజలను మోసం చేయడం ఇక జరగదని ఆయన హెచ్చరించారు.

Advertisements

మొదటి అరగంట వరకు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు

ఆదేశాల ప్రకారం, షాపింగ్ మాల్స్ లోకి వచ్చిన వాహనదారుల నుండి మొదటి అరగంట వరకు ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. అరగంట మించి ఒక గంట లోపు పార్క్ చేసిన వారు మాల్ లో షాపింగ్ చేసినట్లు లేదా సినిమా చూసినట్లు బిల్ లేదా టికెట్ చూపిస్తే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని కమిషనర్ వెల్లడించారు. ఇదే విధంగా, గంటకు పైగా వాహనం నిలిపిన వారు కూడా రుజువుతో కూడిన బిల్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపును పొందవచ్చన్నారు.

vijayawada parking fee shop
vijayawada parking fee shop

మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై జరుగుతున్న దోపిడీకి చెక్

ఈ ఆదేశాల వల్ల నగరంలోని మాల్స్, మల్టీప్లెక్స్ లలో వాహనదారులపై జరుగుతున్న దోపిడీకి చెక్ పడనుందని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని మాల్స్ వాటిని అమలు చేయకపోవడంతో ఈసారి కమిషనర్ ప్రత్యేకంగా ఈ విషయంపై చర్యలు తీసుకున్నారు. ఈ కొత్త విధానంతో వినియోగదారుల హక్కులు కాపాడబడతాయని, మాల్ నిర్వాహకులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related Posts
Raja Singh : సీఎం రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ
Raja Singh letter to CM Revanth Reddy

Raja Singh: ఈ నెల 6న నిర్వహించే శ్రీరామ నవమి శోభ యాత్ర ను అడ్డంకులు లేకుండా నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ Read more

హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ 2025
CEEW brings eco friendly cartoons to Hyderabad Literature Festival 2025

హైదరాబాద్ : కౌన్సిల్ ఆన్ ఎనర్జీ , ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) యొక్క ప్రతిష్టాత్మక కార్టూన్ సిరీస్ అయిన వాట్ ఆన్ ఎర్త్!® (WOE), హైదరాబాద్ Read more

ఫడ్నవీస్‌కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు మెసేజ్
ఫడ్నవీస్‌కు పాకిస్తాన్ నుంచి బెదిరింపు మెసేజ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హత్య బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బెదిరింపులు పాకిస్థాన్ ఫోన్ నంబర్ నుంచి వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం Read more

తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!
Typhoon effect.29 trains cancelled. Railway department announcement

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×