Chandrababu's visit to tirupathi from today

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

Advertisements

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి చంద్రబాబు దర్శించుకోనున్నారు. పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు..ఏపీలో ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.

Related Posts
ఏపీ బడ్జెట్ పై షర్మిల ఆగ్రహం
Sharmila's anger over AP budget

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌పై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ Read more

‘పుష్ప-2’ నుంచి ‘పీలింగ్స్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..
peelings song promo out fro

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే Read more

హౌరాఎక్స్ ప్రెస్ కు త్రుటి లో తప్పిన ప్రమాదం
హౌరాఎక్స్ ప్రెస్ కు త్రుటి లో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో ఆదివారం హౌరా ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. అడవయ్య కాలనీ వద్ద రైలు పట్టాలు విరిగాయి.అదే సమయంలో Read more

Bandi Sanjay : రేషన్ బియ్యం పంపిణీ.. కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
Distribution of ration rice.. Bandi Sanjay challenges Congress

Bandi Sanjay : ఉగాది పండుగ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏప్రిల్ నుంచి రేషన్ Read more

×