Chandrababu's visit to tirupathi from today

నేడు పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన..!

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేట మండలం యల్లమందలో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. శారమ్మ అనే మహిళకు వితంతు పెన్షన్, ఏడుకొండలు అనే వృద్దుడికి వృద్ధాప్య పెన్షన్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు గొట్టిపాటి, అనగాని,రామనారాయణరెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. యల్లమంద గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి ఉంటుంది. కోటప్పకొండ త్రికోటేస్వరుణ్ణి చంద్రబాబు దర్శించుకోనున్నారు. పలువురు మంత్రులు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో యల్లమంద చుట్టుపక్కల మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.

మరోవైపు..ఏపీలో ఈరోజు ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. ఈ మేరకు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమాని ప్రభుత్వం చేపట్టింది.

Related Posts
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
A huge fire broke out in Parawada Pharmacy

అనకాపల్లి : ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు Read more

ఉద్యోగిపై ఏసీబీ రైడ్స్.. రూ.150 కోట్ల ఆస్తుల గుర్తింపు
acb found 150 crore assets

లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్‌ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే Read more

2024లో ట్రంప్ విజయం: భారత ప్రభుత్వానికి కీలక అంశాలు
india

ట్రంప్ 2.0 భారతదేశం మరియు దక్షిణాసియా దేశాలకు ఎలాంటి ప్రయోజనాలని తీసుకొస్తున్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చించబడుతున్నాయి. ఆయన గతంలో తీసుకున్న విధానాలు, ఆయన ప్రతిపాదించిన పథకాలు Read more

ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు
ఎమర్జెన్సీ మూవీపై సద్గురు ప్రశంసలు

బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం "ఎమర్జెన్సీ" గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం భారతదేశ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *