ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు

Chandrababu Naidu: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు: చంద్రబాబు

ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈసారి ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉదయం 11 గంటలకు ప్రకటించారు. ఫస్టియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 70గా నమోదవగా, సెకండియర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 83గా నమోదైంది. ఈ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది.

Advertisements

ఈసారి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులందరికీ హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. ఫస్టియర్ లో 47% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు,సెకండియర్ లో 69% విద్యార్థులు విజయం సాధించారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే: ఫస్టియర్ లో 11 శాతం పెరుగుదల,సెకండియర్ లో 9 శాతం పెరుగుదల, ఈ గణాంకాలు ప్రభుత్వ విద్యా రంగంలో సంభవించిన నాణ్యతా మార్పులకు ప్రతిబింబం అనే చెప్పాలి.

చంద్రబాబు స్పందన

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా స్పందిస్తూ, ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో కొత్త శకానికి నాంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్థాయిలో ఫలితాలు సాధించటం గర్వించదగ్గ విషయం, అని అన్నారు. అంతేకాక, ఇది తాము చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితం అని స్పష్టం చేశారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌ల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, కేంద్రీకృత మూల్యాంకనం, పర్యవేక్షణ, నూతన సమయపాలన, 100 రోజుల సక్సెస్ కార్యక్రమం, తరగతుల వారీగా వాట్సాప్ గ్రూపులు, సంరక్షకుల వ్యవస్థ ఇలా విద్యా రంగంలో మేము ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి అని చంద్రబాబు వివరించారు. 

Read also: B R Naidu: గోశాలలో ఆవుల మృతిపై స్పందించిన టీటీడీ ఛైర్మన్

Related Posts
రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ఘాటైన విమర్శలు
KTR key comments on Amrit tenders

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్ సర్కార్ పై ఘాటైన విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ పాలనలో Read more

Liquor Scam Case : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ
midhunreddy

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి లిక్కర్ స్కాం కేసులో పెద్ద షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోసం దాఖలు Read more

నేడు KRMB కీలక సమావేశం
KRMB meeting today

కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB) నేడు హైదరాబాద్‌లోని జలసౌధలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు Read more

Andhra pradesh: అమరావతి భూములపై ప్రభుత్వ సంచలన నిర్ణయం!
Andhra pradesh: అమరావతి భూములపై ప్రభుత్వ సంచలన నిర్ణయం!

అమరావతికి నూతన శకం ప్రారంభం: విస్తరణ, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ దృష్టి రాజధాని అమరావతిని కేంద్రంగా పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం భారీ మార్పులు తేనున్నదిగా సంకేతాలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×