Chandrababu Naidu is the richest Chief Minister in the country

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నెంబర్ వన్‌గా నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ.931 కోట్లుండగా, అప్పులు రూ.10 కోట్లు ఉన్నాయి. రూ.15 లక్షల ఆస్తులతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు.

Advertisements

దేశంలో టాప్ 3 సంపన్న ముఖ్యమంత్రులు వీరే..

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ వివరాల ప్రకారం.. ఏడీఆర్ ఈ రిపోర్ట్ తయారుచేసింది. మొత్తంగా చంద్రబాబు ఫ్యామిలీ ఆస్తులు రూ. 931 కోట్లతో ఏపీ సీఎం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. చంద్రబాబు పేరిట రూ.36 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. సంపన్న ముఖ్యమంత్రుల్లో అరుణాచల్‌ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు. పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు కాగా, ఆయనకు భారీ స్థాయిలో రూ.180 కోట్ల అప్పులున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. సిద్ధరామయ్యకు రూ.23 కోట్ల అప్పులున్నాయి. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయం రూ.13 లక్షలు కాగా, అప్పులు 1.3 కోట్లు ఉన్నాయి.

దేశంలో బీద ముఖ్యమంత్రులు వీరే..

రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశంలో పేద సీఎంగా నిలిచారు. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచారు.

బిలియనీర్లుగా ఇద్దరు ముఖ్యమంత్రులు..

దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఓవరాల్‌గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు ఉంది. మొత్తం సీఎంల ఏడాది సగటు ఆదాయం రూ.13,64,310 (13 లక్షల 64 వేల 3 వందల పది)గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు. ముగ్గురు సీఎంల ఆస్తులు రూ.50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండగా, 9 మంది సీఎంల ఆస్తులు విలువ రూ.11 నుంచి రూ.50 కోట్ల మధ్య ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇద్దరు సీఎంలు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 12 మంది ముఖ్యమంత్రుల వయసు 51 నుంచి 60 మధ్యలో ఉంది. 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్. ఇద్దరు సీఎంలు డాక్టరేట్ పొందారు.

ఇకపోతే..ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం.. 13 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయి. అందులో 10 మంది సీఎంల మీద కిడ్నాప్, లంచం, హత్యాయత్నం లాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ కాంగ్రెస్ సీఎం మీద 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద 13 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో కేవలం ఇద్దరు మహిళా సీఎంలు ఢిల్లీ – అతిషి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు.

Related Posts
అదుపులోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి: సీఎం యోగి
Situation in Prayagraj under control.. CM Yogi

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో జ‌రిగిన తొక్కిస‌లాట‌పై మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు చెప్పారు. దాదాపు 8 నుంచి Read more

Chandrababu: 27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు
27వ తేదీన పోలవరం సందర్శించనున్న చంద్రబాబు

ఏలూరు/ పోలవరం ప్రభాతవార్త: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఈనెల 27వ తేదీన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పరిశీలన చేసేందుకు విచ్చేయుచున్న దృష్ట్యా ముఖ్యమంత్రి పర్యటనా Read more

UP Professor : విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్‌.. వీడియోలు లీక్‌తో సస్పెండ్‌
విద్యార్థినులను వేధించిన ప్రొఫెసర్‌.. వీడియోలు లీక్‌తో సస్పెండ్‌

కాలేజీ ప్రొఫెసర్‌ పలువురు మహిళా స్టూడెంట్స్‌ను లైంగికంగా వేధించాడు. వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ Read more

తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా
Priyanka Gandhi Vadra entered the Lok Sabha for the first time

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ప్రియాంక తన తల్లి, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ, సోదరుడు, Read more

×