हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Chandrababu:షెడ్యూల్ ప్రకారం దెందేరు వెళ్లాల్సిన సీఎం

Divya Vani M
Chandrababu:షెడ్యూల్ ప్రకారం దెందేరు వెళ్లాల్సిన సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో జరగనున్న పర్యటనలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆయన కొత్తవలస మండలంలోని దెందేరు ప్రాంతానికి వెళ్లవలసి ఉండగా, ఇప్పుడు నవంబర్ 2న గజపతినగరం మండలం పురిటిపెంట ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మార్పు కారణంగా చంద్రబాబు పర్యటన దెందేరుకు బదులుగా పురిటిపెంటలో జరగనుంది.

పురిటిపెంట పర్యటనలో ముఖ్యమంత్రి రహదారి అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. ముఖ్యంగా రహదారుల్లో గుంతలు పూడ్చే పనుల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.826 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించడం విశేషం. ఇందులో భాగంగానే రహదారుల పునరుద్ధరణకు పురిటిపెంటలో పనులు చేపడతారు.

విజయనగరం పర్యటన అనంతరం చంద్రబాబు విశాఖపట్నం వెళ్తారు. నవంబర్ 2 మధ్యాహ్నం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతికి సంబంధించి “విజన్-2047” డాక్యుమెంట్ తయారీకి సంబంధించి వివిధ భాగస్వాములతో సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రణాళిక రాష్ట్రం అభివృద్ధి దిశగా చేపట్టనున్న ప్రాధాన్యతా రంగాలను కవరుచేయడమే లక్ష్యం అంతేకాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870