हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

ఘనంగా చైతన్య టెక్నో స్కూల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు

Sudheer
ఘనంగా చైతన్య టెక్నో స్కూల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు

సత్తుపల్లి స్థానిక గుడిపాడు రోడ్ నందు గల చైతన్య టెక్నో స్కూల్ ఆరవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ఆషా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మండల విద్యాధికారి ఎన్. రాజేశ్వరరావు, అలాగే వివిధ రంగాలకు చెందిన గౌరవనీయ అతిథులు హాజరయ్యారు. సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమా ఆనంద్ బాబు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజలారాణి, 16వ వార్డు మాజీ కౌన్సిలర్ దూదిపాళ్ల రాంబాబు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

spl chaitu

విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు

ఈ సందర్భంగా యస్.యస్.సి. 2024 పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల త్యాగాలు ఎంతోముఖ్యమైనవని, వారి సహకారం లేకుండా పిల్లల విజయం అసాధ్యమని అతిథులు అభిప్రాయపడ్డారు. ముఖ్య అతిథి డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థుల ప్రధాన శత్రువుగా మారిన సెల్ ఫోన్‌కు దూరంగా ఉండి, చదువుపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. కష్టపడే విద్యార్థులే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆయన తెలిపారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వార్షికోత్సవ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాటికలు, నృత్యాలు, పాటలు, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను మెచ్చుకుంటూ అతిథులు వారిని అభినందించారు. విద్య మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావడం పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై. మురళీకృష్ణ, డైరెక్టర్లు ఆర్. సుజాత, ఆర్. రాకేష్, ఎం. రవికుమార్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు. ఈ వేడుకలు చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఈ తరహా కార్యక్రమాలు పిల్లలకు ప్రోత్సాహాన్ని అందించి వారిలో స్వీయవిశ్వాసాన్ని పెంపొందించే అవకాశాన్ని కల్పిస్తాయని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడ్డారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870