Central Financial Assistance : తెలంగాణ,ఆంధ్రప్రదేశ్కు కోట్లు అప్పుల భారం ఆంధ్రప్రదేశ్కు 2025 మార్చి 31 నాటికి మొత్తం రూ.5,62,557 కోట్లు అప్పు ఉంటుందని, తెలంగాణ అప్పు రూ.4,42,298 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్సభలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను వివరించారు.ఆంధ్రప్రదేశ్ అప్పులు స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో 34.7 శాతం ఉండగా, తెలంగాణ అప్పులు 26.2 శాతంగా నమోదయ్యాయని తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఆర్థిక పరంగా రెండు రాష్ట్రాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో స్పష్టమవుతుంది. అప్పుల భారం పెరగడం పట్ల ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై వచ్చిన సందేహాలకు కేంద్రం సమాధానం ఇచ్చింది.

ఈ కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల మేరకు ఈక్విటీ మూలధనాన్ని సమకూర్చిందని, ఇందులో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రవేశపెట్టే యోచన లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై గత కొంతకాలంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వ స్పష్టతతో కార్మికులలో కొంతవరకు భరోసా ఏర్పడింది.ఈ పరిణామాల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అప్పుల భారాన్ని ఎలా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తాయో చూడాల్సి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందా? లేదా? అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితులపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.