Ashwini Vaishnaw

నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే

క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయంసమృద్ధి లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.16,300 కోట్ల వ్యయంతో ఈ మిషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని అశ్వని వైష్ణవ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమని అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు.

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలభనం సాధించడం, ఖనిజాల దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం కేంద్రం లక్ష్యమన్నారు. ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు. ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే విజన్‌కు అనుగుణంగా 2024-25 బడ్జెట్‌లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని మంత్రి చెప్పారు.

Related Posts
అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా
అబద్ధాల అడ్డ అరవింద్ కేజ్రీవాల్: జేపి నడ్డా

బిజెపి చీఫ్ జెపి నడ్డా, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి మరియు మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు, ఆయనను "అబద్ధాల ఎన్సైక్లోపీడియా" అని అభివర్ణించారు. అదే సమయంలో ఫిబ్రవరి 5న Read more

నడిరోడ్డు పై కాంగ్రెస్ నాయకుడు బర్త్ డే వేడుకలు..ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు
Congress leaders roadside

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో సోమవారం రాత్రి కాంగ్రెస్ నాయకుడు చిలుకూరి బాలూ పుట్టినరోజు వేడుకలు జరపడం తో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ వేడుకలు రాజీవ్ చౌక్ Read more

మోహన్ బాబు పిటిషన్ విచారణ వాయిదా
mohan babu

హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. తన వయసు 78 ఏళ్లని, గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నానని, తనకు Read more

ఏపీలో ‘అందరికీ ఇళ్లు’
Housing Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, స్త్రీ సాధికారత లక్ష్యంగా 'అందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలను మహిళల పేరుతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *