हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

CBN – Revanth : బాబు-రేవంత్ లను భేటీకి పిలిచిన కేంద్రం

Sudheer
CBN – Revanth : బాబు-రేవంత్ లను భేటీకి పిలిచిన కేంద్రం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల (Water projects) విషయంలో నెలకొన్న విభేదాలు మరోసారి ఢిల్లీకి చేరాయి. ముఖ్యంగా పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ వివాదంపై చర్చించేందుకు నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకొని సమన్వయం చేయాలనే ఉద్దేశంతో, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక భేటీ నిర్వహించనుంది.

సీఎంలను భేటీకి ఆహ్వానించిన కేంద్రం

ఈ వివాద పరిష్కారానికి ఎల్లుండి (జూలై 16) కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Chandrababu & Revanth)లను ఆహ్వానించింది. సమావేశానికి హాజరుకావడానికి వీలుందో లేదో తెలపాలని ఇద్దరు సీఎంలకు కేంద్రం లేఖ రాసింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మార్పులు, బనకచర్ల లిఫ్ట్ ప్రాజెక్టు పరంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో, ఈ అంశాలను ప్రత్యక్షంగా సీఎంల సమక్షంలో చర్చించాలని కేంద్రం భావిస్తోంది.

బాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆసక్తికర దృశ్యం

ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన రేపటి (జూలై 15) నుంచి ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో పాటు, ఇతర కీలక సమావేశాల్లో పాల్గొననున్న చంద్రబాబు, జలశక్తి శాఖ సమావేశానికి హాజరయ్యే అవకాశముంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీకి ఎలా స్పందిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న నీటి వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? అనే అంశంపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది.

Read Also : Nimisha Priya : ఎల్లుండే నిమిషకు ఉరిశిక్ష.. వాళ్ల మనసు మారదా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870