తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

Central Cabinet: తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడో సారి అధికారం లోకి వచ్చిన తరువాత మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, శ్రీ కాళహస్తికి వచ్చే ప్రయాణీకులతో పాటుగా విద్య, వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది కలగనుంది.

Advertisements
తిరుపతి - కాట్పాడి లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం

రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం
కేంద్రం మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నా యని అన్నారు. దీనితో రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అదే విధం గా ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి పొందుతాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి
తాజాగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరు తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నట్లు తెలిపారు. 104 కి.మీ మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని వివరించారు. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందని తెలిపారు.

READ ALSO: New Aadhar App: కొత్త ఆధార్ యాప్ తెచ్చిన కేంద్రం

Related Posts
NDRF సేవలు ప్రశంసనీయం – చంద్రబాబు
CBN NDRF

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేషనల్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫోర్స్ (NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా క్లిష్ట సమయాల్లో NDRF అందించే Read more

కర్మ అంటే ఇదే… రఘురామ – డిప్యూటీ సీఎం పవన్
raghuram pawa

కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ Read more

భారత్‌పై అధిక పన్నులు: ట్రంప్
అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పన్నులు విధించే కొత్త మార్గాన్ని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి, అమెరికా ఇప్పుడు ప్రతి దేశంపై అమెరికన్ వస్తువులపై Read more

Central Government: సోషల్ మీడియా ఖాతాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే.!
Central Government: సోషల్ మీడియా ఖాతాలన్నీ ప్రభుత్వ చేతుల్లోనే.!

ఫిబ్రవరి 13, 2025 న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. 1961లో అమలులోకి వచ్చిన పాత ఆదాయపు పన్ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×