Category: Business
17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ
ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా…
రతన్ టాటా మరణంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు స్పందించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య స్నేహ బంధానికి ఛాంపియన్గా రతన్ టాటాను ఆయన కొనియాడారు. ఈమేరకు ఎక్స్ వేదికగా సంతాప సందేశాన్ని పంచుకున్నారు. ‘భారత్ గర్వించదగిన కొడుకు’ అని కొనియాడారు. భారత్-ఇజ్రాయెల్ సంబంధాలను పెంపొందించడంలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. ‘‘ఇజ్రాయెల్లోని చాలామంది ప్రజలతో పాటు నేను కూడా రతన్ టాటా…
రతన్ టాటా ఇచ్చిన విరాళాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 09) అర్థరాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్కు గౌరవ్ ఛైర్మన్ గా ఉన్న ఆయన భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషిచేశారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు పొందిన రతన్ టాటా మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటా…
రతన్ టాటా ఆస్తి అంత ఎవరి సొంతం అవుతుంది…?
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా మరణం పట్ల ప్రతి ఒక్కరు స్పందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపు కంపెనీల మార్కెట్ క్యాప్ 34 లక్షల కోట్ల రూపాయలు. ఒక కుటుంబ సంస్థగా ఎదుగుతూ వచ్చిన టాటా గ్రూప్ నేడు ఆ సంస్థలకు నాయకత్వం వహించే తదుపరి వారసుడు ఎవరు అనే సందిగ్ధావస్థకు చేరింది. 86…
సంక్షోభ సమయంలో నేనున్నాంటూ ముందుకు వచ్చిన ‘టాటా’
భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా…
రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయొద్దని ట్విటర్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తు పోస్ట్ చేసిన మూడు రోజులకే ఆయన చనిపోయారు. ఇక రతన్ టాటా అందుకున్న పురస్కారాలు…
రతన్ టాటా మృతి పై ప్రముఖుల సంతాపం
అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రతన్ టాటా కన్నుమూశారు.రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు….
రతన్ టాటా ఇక లేరు
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్…
రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి మరింత విషమం..
రతన్ టాటా (86) ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్లో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తపోటు తగ్గడంతో రతన్ను హాస్పిటల్లో చేర్చగా.. ప్రస్తుతం రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 1991లో భారత అతిపెద్ద సంస్థలలో ఒకటైన టాటా సన్స్కు రతన్ టాటా చైర్మన్ అయ్యారు. 2012 వరకు టాటా గ్రూపుకు ఆయనే నాయకత్వ బాధ్యతలు వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా…
భారీగా పడిపోయిన గోల్డ్ రేట్
పండగవేళ బంగారం ధరలు దిగివస్తుండడం అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ సెషన్ తర్వాత బాగా తగ్గిన బంగారం ధరలు.. గత కొన్ని రోజులుగా పైపైకి పోతూ మళ్ళీ భగ్గుమంటున్నాయి. క్రమంగా గోల్డ్ రేట్లు ఆల్ టైం హైకి చేరుకోవడంతో జనం అయోమయంలో పడ్డారు. గత వారం రోజుల్లో చూస్తే గోల్డ్, సిల్వర్ రేట్లలో భారీ మార్పు కనిపించింది. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గాయి. పండగ సమయంలో బంగారం…