2014లో జరిగిన సమగ్ర సర్వేలో OC (ఆప్తి కేటగిరీ) జనాభా 11% ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఆ సంఖ్య 15.79%కి పెరిగింది.ఇదే సమయంలో బీసీలు మరియు ముస్లింలతో పోలిస్తే OC జనాభా ఎక్కువగా పెరిగిందని,కులగణన సర్వేపై బీసీ సంఘాలు ప్రశ్నిస్తున్నారు.ఈ సర్వే రిపోర్టులో EWS (ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్) రిజర్వేషన్ ప్రయోజనాలను కాపాడటానికే, బీసీ జనాభా తగ్గించి, OC జనాభాను పెంచారని ఆరోపణలు ఉన్నాయి.ప్రత్యక్షంగా 2014 సమగ్ర సర్వేలో 11% ఉన్న OC జనాభా 15.79%కి పెరిగింది.బీసీ సంఘాలు ఈ పెరుగుదలపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, ఈ మార్పు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ సర్వేలో, SC (సమాజికంగా వెనకబడిన కులాలు) జనాభా 18% నుండి 17.43%కి తగ్గింది, అంటే 0.57% తగ్గింది.అలాగే ST (అత్యంత పల్లెటూరి) జనాభా 10% నుండి 10.48%కి పెరిగింది.మరి, B.C జనాభా 51% నుండి 46.25%కి తగ్గింది. ముస్లిం జనాభా కూడా 13% నుండి 12.56%కి తగ్గింది. కానీ OC జనాభా ఎంతగా పెరిగిందంటే 8% నుండి 13.31%కి.
ఈ అసమానమైన వృద్ధి నాటకం జరుగుతోంది అని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఇదే కాకుండా 2024 లో చేపట్టిన ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ప్రకారం జనాభా 3.54 కోట్లుగా నమోదు అయింది.కానీ 2014 సమగ్ర సర్వే ప్రకారం, జనాభా 3.63 కోట్లుగా ఉండగా, 2011 లో 3.5 కోట్లుగా నమోదైంది. ఈ జనాభా వృద్ధి రేటును చూసినప్పుడు,జనాభా పెరిగే పరిస్థితిలో పడాల్సింది, కానీ అది ఎలా తగ్గిందని ఈ లెక్కలు తప్పు అన్నీ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అభిప్రాయపడుతోంది.ఈ విషయంపై అసెంబ్లీలో ఉత్కంఠభరిత చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన నివేదికను ప్రవేశపెట్టినప్పుడు,దాన్ని చరిత్రాత్మకమైన సర్వేగా అభివర్ణించారు.కులగణన సర్వే ప్రకటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.