ఉత్తరప్రదేశ్ బబినా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పారిఛా (Rajeev Singh Parichha) ప్రస్తుతం తీవ్ర విమర్శల మధ్య నిలిచారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడిపై జరిగిన దాడి వీడియో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనను పార్టీ అత్యంత తీవ్రంగా తీసుకొని ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీ (Show cause notice issued to MLA) చేసింది.జూన్ 19న ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్నారు. రైల్లో ఒక సీటు మార్పు విషయంలో ఇతర ప్రయాణికుడిని ఆయన అనుచరులు బెదిరించి దాడికి దిగారు. ఇది ఎమ్మెల్యే ఎదుటే జరిగింది. బాధితుడిపై దాడి చేసి ముక్కు నుంచి రక్తం కారేలా చితకబాదారు. వీడియో బయటకు రావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.

సోషల్ మీడియాలో మండిపడిన నెటిజన్లు
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముకేశ్ నాయక్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ పారిఛా తీరును తీవ్రంగా విమర్శించారు. ఎమ్మెల్యే గూండాలు రైల్లో ఒక ప్రయాణికుడిని అమానుషంగా కొట్టారు అంటూ ట్వీట్ చేశారు.దాడికి సంబంధించిన వైరల్ వీడియో ఒకవైపు ఉంటే, ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ మాత్రం భిన్నంగా వాదిస్తున్నారు. దాడికి గురైన వ్యక్తి తమను పదే పదే ఇబ్బందిపెట్టాడని, వ్యక్తిగత ప్రదేశంలోకి వచ్చి కాళ్లు చాపారని ఆరోపించారు. అంతేకాదు, ఆ ప్రయాణికుడు ఝాన్సీ స్టేషన్లో తన అనుచరులను పిలిపించి తమపై దాడికి ప్రయత్నించాడని కూడా ఫిర్యాదు చేశారు.
బీజేపీ తీరుగా స్పందించింది
వైరల్ వీడియోలోని దృశ్యాలు, ఎమ్మెల్యే చర్యలు పార్టీ గౌరవాన్ని దిగజార్చాయని భావించిన బీజేపీ, ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా చేతుల మీదుగా ఈ నోటీసు పంపబడింది. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also : Sri Ram : హీరో శ్రీరామ్ కు జులై 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు