हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

Sudheer
Harsha Sai : యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి(Harsha Sai)పై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ మరియు మాజీ పోలీస్ అధికారి సజ్జనార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రజలను మోసగాళ్ల నుంచి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదు

తాను ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని, కానీ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఎవరినైనా చట్టపరంగా విచారణ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆన్‌లైన్‌లో ఈ అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదోవ పడే అవకాశముందని, దీనిపై ప్రభుత్వాలు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అభిప్రాయపడ్డారు.

అక్రమ యాప్‌లను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు

బెట్టింగ్ యాప్‌ల వల్ల సామాన్యులు ఆర్థికంగా నష్టపోతున్నారని, అవి పూర్తి మోసపూరితంగా ఉంటాయని సజ్జనార్ ప్రజలకు సూచించారు. వీటిని నమ్మి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి అక్రమ యాప్‌లను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కేసు నేపథ్యంలో హర్ష సాయి సహా ఇతర యూట్యూబర్లపై కూడా దర్యాప్తు జరిపే అవకాశం ఉన్నట్టు సమాచారం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870