UPSC Final Results: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో అనూజ్ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సంచలనం సృష్టించారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఆయన ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.
Read Also :AP 10th Hall tickets Release: ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

అనూజ్ అగ్నిహోత్రికి ఆలిండియా ఫస్ట్ ర్యాంక్!
మెదటి ఐదు స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. అనూజ్ అగ్నిహోత్రి ప్రథమ స్థానంలో ఉండగా, రాజేశ్వరి సువే ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరి తర్వాత వరుసగా ఆకాన్ష్, రాఘవ్, మరియు ఇషాన్ భట్నాగర్ టాప్-5లో నిలిచి తమ సత్తా చాటారు. విజేతల జాబితాలో వివిధ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఉండటం విశేషం.
ఈ ఏడాది మొత్తం 1,087 ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) అనే మూడు దశల వడపోత తర్వాత తుది విజేతలను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులు త్వరలోనే ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) వంటి కీలక విభాగాల్లో శిక్షణ పొందనున్నారు.
ముఖ్య విజేతలు (Top 5):
- అనూజ్ అగ్నిహోత్రి (Rank 1)
- రాజేశ్వరి సువే (Rank 2)
- ఆకాన్ష్ (Rank 3)
- రాఘవ్ (Rank 4)
- ఇషాన్ భట్నాగర్ (Rank 5)
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :