ఆంధ్రప్రదేశ్ (AP) లోని పార్వతీపుర ప్రాంతంలోని గాయత్రి డిగ్రీ కాలేజీలో ఉద్యోగార్ధులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కార్మిక, ఉపాధి శాఖ ఈనెల 6న జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనుంది. నిరుద్యోగ యువతకు ఇది బంగారు అవకాశం అని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా (Job Mela) లో వివిధ రంగాలకు చెందిన 6 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 740 పోస్టులను ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.
Read Also: AP: ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు దరఖాస్తులు

ఈ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు కనీసం టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు పరిమితి 18 నుంచి 30 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఉద్యోగార్థులు తమ విద్యా అర్హతలకు తగిన కంపెనీల వద్ద నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి తక్షణమే ఆఫర్ లెటర్లు ఇవ్వనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: