Latest News: AP: ఇవాళ నిర్వహించే ఎగ్జామ్ వాయిదా

Read Time:  1 min
AP
AP
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ (AP) లోని యాజమాన్య పాఠశాలల్లో ఈరోజు నిర్వహించాల్సిన సమ్మెటివ్-1 పరీక్షలను వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: CII Conference: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 20వ తేదీన

మొదటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు ఈ నెల 17వ తేదీన, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు 20వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మార్పును అన్ని యాజమాన్య పాఠశాలలకు వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.

 AP
 AP

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు. ఈ రోజు పాఠశాలల్లో బాలల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు సంతోషాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.