हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కొత్త హైకోర్టు లింకులు పంపి దోచేస్తున్న కేడీలు తెలంగాణలో పెరుగుతున్న చలి గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

sumalatha chinthakayala
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

Telangana Budget: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రి‌వర్గం బడ్జెట్‌ ఆమోద ముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క , అటు శాసన‌మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందని అటు విపక్షాల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు

కాగా, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా ఆరు గ్యారంటీ ల అమలుపైనే దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ‌పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక, ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్‌ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870