BYD Electric Manufacturing Company Investments in Telangana

BYD: తెలంగాణలో బీవైడీ ఎలక్ట్రిక్ తయారీ సంస్థ పెట్టుబడులు

BYD: చైనాకు చెందిన దిగ్గజ ఆటోమోటివ్ సంస్థ బీవైడీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థ బీవైడీ. హైదరాబాద్ సమీపంలో వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పడానికి సన్నాహాలు మొదలు పెట్టనుంది. ఆ సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న చర్చలు కొలిక్కి వచ్చాయి. భూ కేటాయింపులు సహా అన్ని రకాలుగా ఆ సంస్థకు రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది.

తెలంగాణలో బీవైడీ ఎలక్ట్రిక్ తయారీ

రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు

ఈ యూనిట్ కోసం హైదరాబాద్ పరిసరాల్లో మూడు ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింట్లో ఎక్కడ తమ ఈవీ వాహనాలు, కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పితే బాగుంటుందనే విషయం మీద బీవైడీ ప్రతినిధులు చర్చలు సాగిస్తోన్నారు. ఈ మూడింట్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న తరువాత ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని బీవైడీ ప్రతినిధులు భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా కనెక్టివిటీ గురించి ఆ సంస్థ యాజమాన్యం సమాలోచనలు చేస్తోంది. ఎయిర్, రోడ్, రైలు కనెక్టివిటీ సులభతరంగా ఉండాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే- దేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇది తెలంగాణ దశ దిశను మార్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని అంచనా వేస్తోన్నారు.

వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఇక, హైదరాబాద్‌లో బీవైడీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభించడం ఖాయమౌతుంది. దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమౌతాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ కూడా బీవైడీ ఈవీ వాహనాల తయారీ యూనిట్లు లేవు. ఈ కార్లను కొనుగోలు చేయాలంటే చైనా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయ మార్కెట్‌లో వాటిని విక్రయిస్తోంది. దిగుమతి పన్నుల వల్ల చైనాతో పోల్చుకుంటే బీవైడీ వాహనాల ధర భారత్‌లో అధికంగా ఉంటోంది.

Related Posts
మాజీ సీఎం కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు
ED searches the residence of former CM's son

ఛత్తీస్‌గఢ్‌: ఈడీ అధికారులు ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేశ్ భగేల్ కుమారుడు చైతన్య నివాసంలో సోమవారం సోదాలు నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా Read more

హైడ్రాకు మరో అధికారం..
hydraa ranganadh

అక్రమ నిర్మాణాల ఫై ఉక్కుపాదం మోపేలా రేవంత్ సర్కార్ హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థ కు అనేక ఆదేశాలు ఇవ్వగా..తాజాగా మరో అధికారం Read more

Kavitha: తెలంగాణ అప్పు రూ.4,37,000 కోట్లు మాత్రమే : కవిత
Telangana debt is only Rs. 4,37,000 crore.. Kavitha

Kavitha : నేడు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల Read more

స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి
swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *