हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News:Tirumala-24నుండి శ్రీవారి సేవకు ట్రైనర్ల శిక్షణ

Pooja
Telugu News:Tirumala-24నుండి శ్రీవారి సేవకు ట్రైనర్ల శిక్షణ

Tirumala: తిరుమలకు వచ్చే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. శ్రీవారి సేవకులకు మరింత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వారికి శిక్షణ ఇచ్చే ట్రైనర్లకు ప్రత్యేక తరగతులు నిర్వహించనుంది. టీటీడీ(Tirumala Tirupati Devasthanam) ఈఓ జె. శ్యామలరావు ఆదేశాల మేరకు, ఈ నెల 24వ తేదీ నుంచి మొదటి విడత శిక్షణ ప్రారంభం కానుంది. ఈ మేరకు టీటీడీ పరిపాలనా భవనంలో ఈఓ, జెఈఓ వీరబ్రహ్మం, ప్లానింగ్ విభాగం నిపుణులు, ఐఐఎం అహ్మదాబాద్ ఆచార్యులతో కలిసి ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tirumala

8 అంశాలలో నైపుణ్యం పెంపుపై దృష్టి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో శ్రీవారి సేవకుల ప్రమాణాలను పెంచాలనే సంకల్పంతో కొన్ని సంస్కరణలు చేపట్టామని ఈఓ శ్యామలరావు తెలిపారు. ఇందులో భాగంగా, గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ల(Servant trainers)రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ శిక్షణ పొందిన ట్రైనర్లు, సూపర్వైజర్లు భవిష్యత్తులో సేవకులకు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు.

మొదటి విడత శిక్షణ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం వేళల్లో విధానపరమైన అంశాలపై, మధ్యాహ్నం వేళల్లో వివిధ సేవా కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించేలా ఈ శిక్షణను రూపొందించారు. నైపుణ్యాలు, స్పూర్తిదాయకమైన నాయకత్వం, సులభ పద్ధతిలో అందరికీ అర్థమయ్యేలా ఆదర్శ సేవా లక్షణాలు, పలు భాషలలో ప్రాథమిక నైపుణ్యం వంటి 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈఓ సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి, సీపీఆర్ఓ డాక్టర్ తలారి రవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి సేవకులకు శిక్షణ ఎందుకు ఇస్తున్నారు?

శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు సేవకుల నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ శిక్షణ ఇస్తున్నారు.

శిక్షణ ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది?

మొదటి విడత శిక్షణ ఈ నెల 24వ తేదీ నుండి మూడు రోజుల పాటు కొనసాగనుంది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-newsttd-ttd-takes-steps-for-the-safety-of-pedestrians/andhra-pradesh/542385/


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870